Friday, 31 July 2026 09:02:34 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

నిర్లక్ష్యపు నీడలో జైపూర్‌ బస్టాండ్‌!

Date : 12 May 2026 09:55 PM Views : 788

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్‌ మండల కేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. పారిశ్రామిక కేంద్రంగా వెలుగొందుతున్నా, ప్రయాణికులు తలదాచుకోవడానికి నిలువ నీడ లేకపోవడంతో తీవ్ర ఎండలకు తట్టుకోలేక పలువురు సొమ్మసిల్లి పడిపోతుండటం స్థానికులను కలచివేస్తోంది. దీనికి తోడు, ఓ వ్యక్తి బస్టాండ్‌ సమీపంలోని ఫుట్‌పాత్‌ను కబ్జా చేయడంతో సామాన్యుల రాకపోకలకు మరింత ఆటంకం కలుగుతోందని, అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో పర్యటించే సమయంలో చిన్న ప్లాస్టిక్‌ కవర్‌ కనిపిస్తేనే పంచాయతీ కార్యదర్శులకు కఠిన ఆదేశాలు జారీ చేసే జిల్లా అధికారులకు, నడిబొడ్డున కనిపిస్తున్న ఈ కబ్జాలు, ప్రయాణికుల దుస్థితి ఎందుకు కనబడటం లేదని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మండల కేంద్రంలోనే అన్ని శాఖల కార్యాలయాలు ఉన్నా, అధికారులు నిత్యం ఇటే వెళ్తున్నా.. కళ్లముందున్న సమస్యను పట్టించుకోకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి అక్రమ కబ్జాలను తొలగించి, ప్రయాణికులకు నీడ కల్పించాలని కోరుతున్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :