Friday, 31 July 2026 11:09:25 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

విద్యుత్ ఆర్టిజన్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి: సీఐటీయూ డిమాండ్

Date : 15 April 2026 02:54 PM Views : 113

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్ల తమ సమస్యల పరిష్కారం కోసం గత ఏడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా మంచిర్యాలలో నిరసన జ్వాలలు మిన్నంటాయి.బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి,స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ధర్నా చేపట్టారు.ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్లేకార్డులతో నినదిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నాయకులు విమర్శించారు.సమ్మె చేస్తున్న కార్మికులను విధుల్లో నుంచి తొలగిస్తామంటూ బెదిరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 19 వేల మంది ఆర్టిజన్లు, 1,400 మంది అన్మెన్, పీసెట్ కార్మికులు ఈ పోరాటంలో పాల్గొంటున్నారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాల్సింది పోయి, కార్మికులను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని పేర్కొన్నారు.కార్మికుల డిమాండ్లు గొంతెమ్మ కోరికలు కావు. ప్రభుత్వం ఇచ్చిన హామీలనే వారు అడుగుతున్నారు. టర్మినేషన్ ఉత్తర్వులతో సమ్మెను అణచివేయాలని చూడటం అగ్నికి ఆజ్యం పోయడమే అవుతుంది." ​ప్రభుత్వం తక్షణమే స్పందించి ట్రాన్స్‌కో, జెన్‌కో, మరియు డిస్కాం పరిధిలోని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సంకె రవి, జిల్లా కమిటీ సభ్యులు గోమాస ప్రకాష్, చిన్నయ్య, మరియు నాయకులు వెంకటేష్, అంజి, కిష్టయ్య, అరుణ్ కుమార్, శ్రీనివాస్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :