వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : గోలేటీలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఆత్రం సుగుణక్క రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామానికి చెందిన కోట పద్మ–భీమయ్య దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అజ్మీర శ్యాం నాయక్ పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను పొందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ ఇరుకుల మంగ,డీసీసీ ఉపాధ్యక్షులు ప్రకాష్ రావు,డీసీసీ స్పోక్స్ పర్సన్ దుర్గం రవీందర్, మండల అధ్యక్షుడు కిషన్ గౌడ్,నాయకులు సోమశేఖర్,INTUC ప్రకాష్,మహేష్ రెడ్డి,సాంబ గౌడ్,పర్వత్ సాయి,ఉప సర్పంచ్ దుర్గం తిరుపతి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు బలరాం నాయక్, లింగంపల్లి ప్రభాకర్, సురేందర్ రాజు, యూత్ కాంగ్రెస్ జిల్లా జన సెక్రటరీ ఎర్రం తిరుపతి, వార్డు సభ్యులు బానోతు రవి,రాజు,పూదరి సాయి, క గజ్జల భీమయ్య,జాడి కిషోర్, ఆత్మకూరు శంకర్,కోట తిరుపతి పాల్, రవి, బాలు నాయక్,అన్నం రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎలుగల సాయి, భీమేష్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం