Sunday, 02 August 2026 04:02:08 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

దళితులపై పెత్తందారుల దౌర్జన్యం బుట్టరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్

Date : 02 May 2026 04:59 PM Views : 134

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామంలో దళితులపై జరుగుతున్న పెత్తందారుల దౌర్జన్యాలను అరికట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి డిమాండ్ చేశారు. శనివారం రొయ్యలపల్లి గ్రామంలో బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు.గ్రామానికి చెందిన రావుల సుజాత, జీవన్ దంపతులు తాము కొనుగోలు చేసిన భూమిలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం పిల్లర్లు వేస్తుండగా, అదే గ్రామానికి చెందిన గోడిసెల బుట్టరెడ్డి, అతని భార్య సమ్మక్క కలిసి ఆ పిల్లర్ రాడ్లను కూల్చివేశారు. ఈ క్రమంలో బాధితులను కులం పేరుతో దూషిస్తూ అరాచకానికి పాల్పడ్డారని రవి ఆరోపించారు. రాజకీయ కక్షల నేపథ్యంలో దళితులను లక్ష్యంగా చేసుకుని బుట్టరెడ్డి దౌర్జన్యం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ పెత్తందారులకు ఊడిగం చేస్తున్న కోటపల్లి ఎంపిడిఓ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించకపోవడం వల్లే పెత్తందారులకు బలం చేకూరుతోందని విమర్శించారు.లేని పక్షంలో కార్మిక శాఖ మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని సంకె రవి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం, ఆత్రం సంపత్, దుర్గం గంగారాం, దుర్గ మహేష్, బాధితులు రావుల సుజాత, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :