Friday, 31 July 2026 11:09:17 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బిల్‌ కలెక్టర్, బీట్‌ ఆఫీసర్‌

Date : 01 May 2026 06:06 PM Views : 66

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణలో వేర్వేరు ఘటనల్లో అవినీతికి పాల్పడుతూ ఒక మున్సిపల్ బిల్ కలెక్టర్, ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ​ఒకరు సదాశివపేట ఆస్తి పన్ను తగ్గింపు కోసం.సదాశివపేట మున్సిపాలిటీలో బిల్‌ కలెక్టర్‌ నిఖిల్‌రెడ్డి ఒక ఇంటి యజమాని నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.బాధితుడికి రావాల్సిన రూ. 1.04 లక్షల ఇంటి పన్నును రూ. 35 వేలకు తగ్గిస్తానని నమ్మించి, అందుకు రూ. 35 వేలు డిమాండ్ చేశాడు. ఇప్పటికే రూ. 20 వేలు తీసుకున్న నిఖిల్‌రెడ్డి, గురువారం మిగిలిన రూ. 15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ​రెండోది భద్రాద్రి జిల్లా పోడు భూమి విషయంలో.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ బానోత్ నరేశ్‌ ఏసీబీకి చిక్కాడు. ఒక రైతు సాగు చేసుకుంటున్న పోడు భూమి జోలికి రాకుండా ఉండేందుకు నరేశ్ రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు, లంచం తీసుకుంటున్న సమయంలో నరేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ​ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :