Friday, 31 July 2026 11:17:00 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

​సింగరేణి మందమర్రి ఏరియాలో ఘనంగా 'మల్టీ డిపార్ట్‌మెంటల్' సమీక్షలు!

Date : 22 May 2026 04:38 PM Views : 693

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సింగరేణి సి&ఎండి డా. బుద్ధ ప్రకాష్ జ్యోతి ఆదేశాల మేరకు మందమర్రి ఏరియాలోని కీలకమైన (కేకే-5) భూగర్భ గనిలో మూడు షిఫ్టుల ఉద్యోగులతో మల్టీ డిపార్ట్‌మెంటల్ సమీక్షా సమావేశాలు ఘనంగా జరిగాయి. సంస్థ అభివృద్ధి, ఉత్పత్తి లక్ష్యాల సాధనే ధ్యేయంగా ఉద్యోగులు పునరంకితం కావాలని అధికారులు పిలుపునిచ్చారు. మందమర్రి ఏరియా ఆర్థిక వృద్ధిలో, సుదీర్ఘ చరిత్ర కలిగిన కే కే -5 భూగర్భ గని అత్యంత వ్యూహాత్మక పాత్ర పోషిస్తోందని అధికారులు కొనియాడారు. ​రక్షణతో కూడిన ఉత్పత్తి: భూగర్భ గనుల్లోని సవాళ్లను అధిగమిస్తూ, రక్షణ ప్రమాణాలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ బొగ్గు వెలికితీయడంలో కార్మికుల కృషి అమోఘమన్నారు. ​ కే కే -5 బొగ్గుకు ఉన్న మంచి డిమాండ్‌ను నిలబెట్టుకోవడానికి, వినియోగదారులకు మరింత నాణ్యమైన బొగ్గును అందించాలని స్పష్టం చేశారు. కంపెనీ నిర్దేశించిన వార్షిక లక్ష్యాలు, సురక్షిత పని వాతావరణం, యాజమాన్యం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఫైనాన్స్ అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఓ టూ జీఎం జి.ఎల్ ప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, కేకే గ్రూప్ ఏజెంట్ రాంబాబు, డీజీఎం (పర్సనల్) చొల్లంగి అశోక్, డీజీఎం (ఐఈడీ) కిరణ్ కుమార్, గని మేనేజర్ శంభునాథ్ పాండే, క్వాలిటీ ఇంచార్జ్ ప్రదీప్, ఐటీ డీవై మేనేజర్ రవి, డీవై మేనేజర్ జశ్వంత్, ఈఈ శ్యామ్, సంక్షేమ అధికారిణి రవళి తదితర అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: