Sunday, 02 August 2026 02:03:06 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఇందిరమ్మ ఇళ్లపై కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యమా..?

పేదల ఇంటి కలకు గండి..!

Date : 22 July 2026 12:29 PM Views : 228

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తిర్యాని: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని చెలిమెల కొలం గుడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైన తొలి దశలోనే నిలిచిపోయాయి. పునాదులు వేసిన తర్వాత నెలలు గడుస్తున్నా నిర్మాణాలు ముందుకు సాగకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పునాదుల్లో నీరు నిలిచి పనులు పూర్తిగా నిలిచిపోయాయి.గ్రామస్థుల కథనం ప్రకారం, కొంతమంది కాంట్రాక్టర్లు నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేసి అసంపూర్తిగా వదిలేశారని ఆరోపిస్తున్నారు. దీంతో నిరుపేదల సొంతింటి కల నెరవేరక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. నిర్మాణ పనులపై కాంట్రాక్టర్లకు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఏఈని నియమించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కనిపించడం లేదని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.ఈ విషయంపై తిర్యాని ఎంపీడీవోను వివరణ కోరగా, కాంట్రాక్టర్లను పలుమార్లు సంప్రదించినప్పటికీ వారు స్పందించడం లేదని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తికాని లబ్ధిదారులు నేరుగా తమ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని, అందిన ఫిర్యాదులను పరిశీలించి జిల్లా కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులకు నివేదిస్తామని, అనంతరం నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ప్రభుత్వం నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యానికి గురికాకుండా నిలిచిపోయిన నిర్మాణాలను వెంటనే పునఃప్రారంభించి, బాధ్యులపై చర్యలు తీసుకుని లబ్ధిదారులకు న్యాయం చేయాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: