వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జూన్ 26: యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ సూచించారు. శుక్రవారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని డి-అడిక్షన్ సెంటర్ను ఆయన సందర్శించి, అక్కడ వ్యసన బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు, కౌన్సెలింగ్, పునరావాస కార్యక్రమాలను పరిశీలించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, వ్యసనాలకు బానిసైన వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడం సమాజం ముందున్న అత్యంత కీలక బాధ్యత అని అన్నారు. మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ, అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే స్పందించాలని కోరారు. కుటుంబ సభ్యుల అప్రమత్తత, సమాజ సహకారంతోనే మాదకద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందని డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం