Sunday, 02 August 2026 01:51:49 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా సిరిసిల్ల బ్రిడ్జిపై యువజన కాంగ్రెస్ బైఠాయింపు:

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్

Date : 27 June 2026 02:11 PM Views : 293

వాస్తవ గమ్యం / తెలంగాణ / కరీంనగర్ : సిరిసిల్ల: నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి నిరసనగా,"ఛాత్రోం కీ గూంజ్" పేరిట యువజన కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కౌడగాని వెంకటేష్ ఆధ్వర్యంలో నాయకులు సిరిసిల్ల బ్రిడ్జిపై బైఠాయించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా కౌడగాని వెంకటేష్ మాట్లాడుతూ.నీట్ లీకేజీ వల్ల మనస్తాపంతో 21 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ ప్రభుత్వం తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 80కి పైగా పేపర్లు లీక్ అయ్యాయని, కేంద్ర మంత్రి రాజీనామా చేయకుంటే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధులు గుడిసె ప్రభాకర్, రెడ్డిమల్ల భాను, నియోజకవర్గ అధ్యక్షులు చుక్క రాజశేఖర్, న్యాత నవీన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగం మురళి, శేఖర్ శౌర్య నాయక్, ఎడ్ల తిరుపతి మరియు పలువురు మండల, టౌన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

S PRADEEP

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :