Sunday, 02 August 2026 04:20:00 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

రాజకీయాలు కాదు.. రైతుల ప్రయోజనాలే ముఖ్యం

కన్నేపల్లి పంప్‌హౌస్ మోటార్లు ప్రారంభించి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించాలి: రైతుల విజ్ఞప్తి

Date : 13 July 2026 01:40 PM Views : 122

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రాజకీయాలకు అతీతంగా రైతులు, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. పంటల సాగుపై తీవ్ర అనిశ్చితి నెలకొని రైతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణహిత నది ద్వారా లక్షల క్యూసెక్కుల నీరు తెలంగాణ మీదుగా ప్రవహించి వినియోగం లేకుండా దిగువకు వెళ్లిపోతోందని తెలిపారు. ఈ నీటిని సద్వినియోగం చేసేందుకు కన్నేపల్లి పంప్‌హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభించి ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు ఇతర రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.కన్నేపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి ప్రాజెక్టులను నింపడం వల్ల ఎలాంటి సాంకేతిక నష్టం జరగదని రిటైర్డ్ ఇంజనీర్లు ఇప్పటికే సూచించారని రైతులు తెలిపారు. అవసరమైతే తాము స్వయంగా అక్కడే ఉండి పంపింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి సిద్ధంగా ఉన్నామని వారు వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు.ప్రాజెక్టులను నింపడం వల్ల రాష్ట్రంలోని రైతులు,ప్రజలకు మేలు జరుగుతుందని, ఏ ప్రాజెక్టుకు లేదా ఎవరికీ మంచి పేరు వస్తుందన్నది ముఖ్యమేమీ కాదని, ప్రజా ప్రయోజనాలే ప్రభుత్వ నిర్ణయాలకు ప్రాధాన్యం కావాలని రైతులు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల బాధ్యత రైతుల ప్రయోజనాలను కాపాడటమేనని, అందువల్ల ఆలస్యం చేయకుండా కన్నేపల్లి పంప్‌హౌస్ మోటార్లను ప్రారంభించి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు విజ్ఞప్తి చేశారు.

GADDAM SHASHIKANTH

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: