Sunday, 02 August 2026 04:18:41 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

బిఆర్ఎస్వీ విద్యార్థి నాయకుల ముందస్తు అరెస్ట్

Date : 18 June 2026 12:00 PM Views : 180

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టదలచిన నిరసన కార్యక్రమానికి పోలీసులు ముందస్తుగానే అడ్డంకులు సృష్టించారు. ఇందులో భాగంగా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని మందమర్రి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్వీ నాయకులు ఎండి ముస్తఫా, దాసరి నవీన్, సీపెల్లి సాగర్, మాసు వెంకటేష్, బెల్లం అరుణ్, శనిగారపు అరుణ్ తదితరులు ఉన్నరు.ఎండి ముస్తఫా పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్వీ నాయకుడు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాము శాంతియుతంగా నిరసన తెలపడానికి ప్రయత్నిస్తే, అక్రమ అరెస్టులతో అణచివేయాలని చూడడం దుర్మార్గమన్నారు.23,000 ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ నిర్ణయం వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని, వెంటనే ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న అధిక ఫీజులను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ​ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలి - విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలి" అనే నినాదంతో విద్యార్థుల భవిష్యత్తు కోసం, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం బీఆర్ఎస్వీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ​పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, విద్యార్థి లోకం పక్షాన తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు హెచ్చరించారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: