Friday, 31 July 2026 09:09:16 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

కిష్టంపేట ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నేత దుర్గం అశోక్..

Date : 23 May 2026 03:13 PM Views : 864

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : చెన్నూరు మండల పరిధిలోని కిష్టంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, చెన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ కంటెస్టెడ్ అభ్యర్థి దుర్గం అశోక్ సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యంపై ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏ ఓ) యామినితో ఫోన్ ద్వారా మాట్లాడి, కొనుగోళ్లలో అలసత్వాన్ని వీడి త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ... కొనుగోలు కేంద్రాలకు లారీలు రావాలంటే 5000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని, అలాగే అన్ లోడింగ్ కోసం బస్తాకు రూ. 15 నుండి రూ. 20 (క్వింటాలుకు సుమారు రూ. 50) వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా, తేమ పేరుతో బస్తాకు 2 నుండి 5 కిలోల వరకు తరుగు (కటింగ్) విధిస్తూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చెన్నూరు మార్కెట్ యార్డ్ గోదాముకు వెళ్లిన ఆయన.ఎలాంటి తరుగు లేకుండా, తక్షణమే అన్ లోడింగ్ ప్రక్రియను పూర్తి చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని పై అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ చెన్నూరు మండల అధ్యక్షులు బుర్ర రాజశేఖర్ గౌడ్, 18వ వార్డు కౌన్సిలర్ ఏతం శివకృష్ణ, మాజీ పట్టణ అధ్యక్షులు జాడి తిరుపతి, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఆలం బాపు, పట్టణ ప్రధాన కార్యదర్శి కాయిత వెంకటేష్, సీనియర్ నాయకులు యువరాజ్, రాజేశ్ చింతల తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: