వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని సుందరయ్య కాలనీ వెంకటేశ్వర ఆలయం ముందు శుక్రవారం ఉదయం స్కూల్కు వెళ్తున్న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. స్థానికుల కథనం ప్రకారం, ఉదయం పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఆలయం సమీపంలో సంచరిస్తున్న కుక్కలు ఒక్కసారిగా చిన్నారిపై దాడి చేశాయి. స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను తరిమివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాయపడిన చిన్నారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.నస్పూర్ పట్టణంలోని వెంకటేశ్వర ఆలయం పరిసరాలు, పాఠశాలలు, ప్రధాన రహదారుల వద్ద వీధి కుక్కల సంచారం రోజురోజుకు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.ఈ ఘటన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, ఆలయాలు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుని కుక్కలను పట్టి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, లేకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
Reporter
వాస్తవ గమ్యం