వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : లక్షెట్టిపేట గురుకుల జూనియర్ కళాశాలలో నేడు స్పాట్ అడ్మిషన్లు అర్హులైన విద్యార్థినులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని టీజీఎస్ఈడబ్ల్యూఆర్ఎస్/జూనియర్ కళాశాల (బాలికలు)లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం సోమవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల డీసీవో కోటూరి రామకళ్యాణి తెలిపారు. ఆసక్తి గల అర్హులైన విద్యార్థినులు మధ్యాహ్నం 12 గంటలలోపు తమ దరఖాస్తులను కళాశాలలో సమర్పించాలని సూచించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు చేపట్టి, ఎంపికైన విద్యార్థినులకు వెంటనే ప్రవేశాలు కల్పించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ అరుదైన అవకాశాన్ని అర్హులైన విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల యాజమాన్యం కోరింది.
Reporter
వాస్తవ గమ్యం