వాస్తవ గమ్యం / తెలంగాణ / కరీంనగర్ : విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని హుజూరాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు. పట్టణ పరిధిలోని పలు కిరాణా దుకాణాలు, పాన్ షాపులు మరియు ఇతర వ్యాపార సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు, మత్తు పదార్థాల విక్రయాలపై పరిశీలన చేపట్టారు.ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ, విద్యార్థులకు లేదా యువతకు మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు గుర్తించిన వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిత్యం నిఘా ఉంచాలని, పాఠశాలలు మరియు కళాశాలల యాజమాన్యాలు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాల నిర్మూలనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిషేధిత పదార్థాల విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు.
Reporter
వాస్తవ గమ్యం