Sunday, 02 August 2026 04:48:50 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

విద్యార్థులకు మత్తు పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు – హుజూరాబాద్ ఏసీపీ మాధవి

Date : 19 June 2026 10:56 PM Views : 158

వాస్తవ గమ్యం / తెలంగాణ / కరీంనగర్ : విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని హుజూరాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు. పట్టణ పరిధిలోని పలు కిరాణా దుకాణాలు, పాన్ షాపులు మరియు ఇతర వ్యాపార సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు, మత్తు పదార్థాల విక్రయాలపై పరిశీలన చేపట్టారు.ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ, విద్యార్థులకు లేదా యువతకు మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు గుర్తించిన వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిత్యం నిఘా ఉంచాలని, పాఠశాలలు మరియు కళాశాలల యాజమాన్యాలు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాల నిర్మూలనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిషేధిత పదార్థాల విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు.

S PRADEEP

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :