వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : అమెరికాలో శ్రీవారి భక్తి వైభవం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అలెన్ నగరంలోని రాధాకృష్ణ ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీవారి లడ్డూ వేలంలో భక్తుడు వెంకట రమణ ఏకంగా 7,77,777 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.7.4 కోట్లు) వెచ్చించి లడ్డూను దక్కించుకుని కొత్త రికార్డు సృష్టించారు. ఈ అపూర్వ ఘటనతో ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగగా, భక్తుల విశ్వాసానికి ఇది నిదర్శనంగా నిలిచింది. శ్రీవారి ప్రసాదం కోసం కోట్ల రూపాయలు వెచ్చించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, ఈ వేలం ఆధ్యాత్మిక చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచింది.
Reporter
వాస్తవ గమ్యం