Saturday, 01 August 2026 03:36:35 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి రాములు

Date : 15 July 2026 07:36 PM Views : 33

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ప్రభుత్వం చేపట్టిన భూముల రీ-సర్వే ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు అధికారులను ఆదేశించారు.బుధవారం భీమారం మండలం మద్దికల్ గ్రామంలో జరుగుతున్న భూముల రీ-సర్వే పనులను మండల తహసీల్దార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మద్దికల్ గ్రామంలో మొత్తం 853 సర్వే నంబర్లలో 4,810 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. ముగ్గురు లైసెన్స్‌డ్ సర్వేయర్లు, ఒక సర్వేయర్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, రైతుల సమక్షంలో సర్వే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.రీ-సర్వే పనులకు రైతులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని పేర్కొన్న ఆయన, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలని సూచించారు. దీంతో భవిష్యత్తులో భూ వివాదాలకు అవకాశం తగ్గడంతో పాటు, స్పష్టమైన వివరాలతో నక్షాలు సిద్ధమవుతాయని తెలిపారు.అనంతరం ఆరెపల్లి గ్రామం, భీమారం మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.తదుపరి అంకుశాపూర్ గ్రామంలోని సమతా అగ్రో ఇండస్ట్రీస్‌ను పరిశీలించిన అదనపు కలెక్టర్, మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేసి ప్రభుత్వానికి అందించాల్సిన.సీఎంఆర్ (కస్టమ్ మిల్ల్డ్ రైస్)ను నిర్ణీత గడువులోగా సరఫరా చేయాలని రైస్ మిల్లు నిర్వాహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: