Friday, 31 July 2026 11:09:17 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఆసుపత్రియా? పార్టీ హాలా? రెబ్బెన సర్కారు దవాఖానాలో సిబ్బంది నిర్వాకం!

Date : 17 June 2026 07:31 PM Views : 169

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా (రెబ్బెన)లో.పేదలకు ప్రాణం పోసే దేవాలయాలుగా వర్ధిల్లాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులు.. బాధ్యతారాహిత్యానికి నిలయాలుగా మారుతున్నాయి. తాజాగా రెబ్బన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు వైద్యం అందించే కేంద్రంలా కాకుండా, బర్త్‌డే వేడుకలు జరుపుకునే 'కేక్ కటింగ్' పాయింట్‌గా మారిపోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.ఆసుపత్రి వెలుపల రోగులు నరకయాతన అనుభవిస్తూ వైద్యం కోసం గంటల తరబడి వేచి చూస్తుంటే, లోపల ఉండాల్సిన సిబ్బంది మాత్రం బర్త్‌డే కేకుల ముందు 'బిజీబిజీ'గా గడిపారు. రోగుల ప్రాణాల కంటే తమ వ్యక్తిగత వేడుకలే ముఖ్యమన్నట్లుగా సిబ్బంది ప్రవర్తించారు. ఒకరికొకరు కేకులు తినిపించుకుంటూ, కేరింతలు కొడుతూ హుషారుగా కనిపించడం అక్కడికి వచ్చిన వారిని విస్మయానికి గురిచేసింది. అత్యవసర వైద్య సేవలు అందించే పరికరాల మధ్యే ఈ 'కేక్ కటింగ్' పండగ జరగడం సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది.విధి నిర్వహణలో అత్యంత బాధ్యతాయుతంగా ఉండాల్సిన వైద్య సిబ్బంది, ఇలాంటి తీపి పనులతో కాలక్షేపం చేస్తే ఇక మా ప్రాణాలకు గ్యారెంటీ ఏంటి? అని రోగులు, వారి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిని పార్టీ హాలుగా మార్చేసిన ఈ 'వైద్య' వీరులపై ఉన్నతాధికారులు ఎలాంటి 'చేదు' చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :