వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మారుతున్న కాలంతో పాటు ఉత్తరాల సంఖ్య తగ్గినప్పటికీ, తన సేవల్లో ఎలాంటి మార్పు రానివ్వకుండా ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న మందమర్రి పోస్టుమ్యాన్ ఉప్పలంచి శంకర్లింగంను లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు.ప్రజాసేవలో ఆయన చూపిన అంకితభావానికి, నిరంతర కృషికి గుర్తింపుగా క్లబ్ ప్రతినిధులు ఆయనను శాలువాతో సత్కరించి, ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ... నిశ్శబ్దంగా, నిరడంబరంగా సమాజానికి సేవ చేస్తూ శంకర్లింగం అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లోనూ ప్రతి గడపకూ నమ్మకంతో సేవలు అందించే పోస్టల్ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని, శంకర్లింగం సేవలు చిరస్మరణీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, స్థానిక ప్రముఖులు మరియు సన్మాన గ్రహీత శంకర్లింగం అభిమానులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Admin
వాస్తవ గమ్యం