Friday, 31 July 2026 11:09:16 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పోరాటం కొనసాగుతుంది

బట్టారి వెంకటేశ్వర్లు

Date : 11 July 2026 07:18 PM Views : 42

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రాష్ట్రోపాధ్యాయ సంఘం మంచిర్యాల జిల్లా ప్రత్యేక కార్యవర్గ సమావేశం శనివారం జిల్లా అధ్యక్షుడు భట్టారి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పర్వతి రెడ్డి, జాక్టో కో-చైర్మన్ పర్వతి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ మాట్లాడుతూ, జూలై 15న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే త్వరలోనే పీఆర్సీ నివేదికను స్వీకరించి అమలు చేస్తారని, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వీలైనంత త్వరగా పూర్తిగా చెల్లిస్తారని రాష్ట్ర స్థాయి సమావేశంలో ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ మాట్లాడుతూ, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు రాష్ట్రోపాధ్యాయ సంఘం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు వెంటనే చేపట్టాలని, ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనను ప్రభుత్వం. విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళనలకు సిద్ధమవుతారని హెచ్చరించారు.సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఓడిగే కృష్ణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు వనమాల పద్మ, రాష్ట్ర కౌన్సిలర్ వి. కరుణాకర్, ఉపాధ్యక్షుడు చీపెళ్లి బాపు, మహిళా కార్యదర్శులు మహాలక్ష్మి, స్వప్న, మన్మోహన్, రాజ్‌కుమార్, సుమన్, విశ్వనాథ్, జయ, గంగుతాయి తదితరులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :