వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ సూచించారు. ప్రజలు ఎవరు కూడా చెరువుల దగ్గరికి కాలువల దగ్గరికి వెళ్లకూడదని అలాగే తల్లిదండ్రులు, పిల్లలను బయటికి వెళ్లకుండా చూసుకోవాలని ఎస్సై తెలిపారు. పంట పొలాలకు వెళ్లే రైతులు అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్లకూడదని పశువులను మేతకు తీసుకెళ్లిన చోట జాగ్రత్తగా ఉండాలని కరెంటు వైర్ల కింద కరెంట్ పోల్స్ దగ్గరికి వెళ్ళకూడదని ఆయన తెలిపారు.ఏదైనా అత్యవసరం ఉంటే 100 నెంబర్ కి డయల్ చేయాలని ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం