వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త, కన్నాల బస్తీ నివాసి సంబోధి శ్రీను ప్రతిష్టాత్మక 'దళిత రత్న' అవార్డును దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గురువారం రోజున టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి తన నివాసంలో శ్రీనును ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. శ్రీనుకు దళిత రత్న అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, నాతరి స్వామి ఆయనను శాలువాతో కప్పి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.దళితులు సామాజికంగా,ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సమాజ సేవలో గుర్తింపు పొందడం అభినందనీయమని కొనియాడారు.ఇలాంటి పురస్కారాలు దళిత బిడ్డల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతాయని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని సంబోధి శ్రీనుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Admin
వాస్తవ గమ్యం