Saturday, 01 August 2026 11:54:39 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి:

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Date : 23 July 2026 07:38 PM Views : 47

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.గురువారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, వి. రాములతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.జిల్లాలో సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ఇప్పటికే సుమారు 90 శాతం పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను నిర్ణీత గడువుకంటే ముందే పూర్తి చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో అనామోలీస్ ఎక్కువగా ఉన్నాయని, డిజిటలైజేషన్ పూర్తైన అనంతరం సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. నోటీసులు అందుకున్న ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నోటీసులో సూచించిన ధ్రువపత్రాలను సమర్పించడం ద్వారా ఓటు హక్కును కొనసాగించుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. డబుల్, మరణించిన, ఇతర ప్రాంతాలకు మారిన వారి ఓట్లను ఎన్నికల నిబంధనల ప్రకారం తొలగిస్తామని తెలిపారు. ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని ఓటర్లను గుర్తించి, బూత్ స్థాయి ఏజెంట్ల ద్వారా బూత్ స్థాయి అధికారులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డిజిటలైజేషన్ పూర్తైన అనంతరం పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ కూడా చేపడతామని వెల్లడించారు.సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, మంచిర్యాల రాజస్వ మండలాధికారి శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం అధికారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: