Friday, 31 July 2026 11:09:22 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

పంట పొలాల్లో అక్రమ విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు: మందమర్రి పోలీసులు

Date : 02 July 2026 06:06 PM Views : 72

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి,జులై 2 : పంటలను అడవి జంతువుల నుంచి రక్షించేందుకు పొలాల చుట్టూ అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరమని మందమర్రి పోలీసులు హెచ్చరించారు. ఇటీవల కొంతమంది రైతులు కోతులు, అడవి పందులు, నీలిగాళ్లు తదితర జంతువుల నివారణ కోసం నేరుగా విద్యుత్ లైన్ల నుంచి కరెంట్ తీసుకుని పొలాల చుట్టూ తీగలు ఏర్పాటు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఈ విధంగా అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం వల్ల అమాయక ప్రజలు, పశువుల కాపరులు,వ్యవసాయ కూలీలు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అడవి జంతువులను నివారించేందుకు విద్యుత్ లైన్ల నుంచి నేరుగా కరెంట్ కనెక్షన్లు ఇవ్వడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. అక్రమ విద్యుత్ తీగల కారణంగా ఎవరికైనా ప్రాణనష్టం సంభవిస్తే, సంబంధిత భూ యజమాని లేదా కరెంట్ కనెక్షన్ ఏర్పాటు చేసిన వ్యక్తిపై నేరపూరిత మానవహత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని హెచ్చరించారు.పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ (ట్రాన్స్‌కో) అధికారులు సంయుక్తంగా పొలాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్రమ విద్యుత్ కనెక్షన్లు గుర్తిస్తే విద్యుత్ చట్టాల ప్రకారం భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని పేర్కొన్నారు. రైతులు పంటలను రక్షించేందుకు ప్రభుత్వం అనుమతించిన సోలార్ ఫెన్సింగ్ (తక్కువ వోల్టేజ్), నైలాన్ నెట్లు లేదా ఇతర సురక్షితమైన పద్ధతులను మాత్రమే వినియోగించాలని, నేరుగా విద్యుత్ తీగలను ఏర్పాటు చేయరాదని సూచించారు.అలాగే, అక్రమ విద్యుత్ కనెక్షన్లపై సమాచారం ఉన్న వారు వెంటనే మందమర్రి పోలీస్ స్టేషన్ లేదా డయల్-100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :