Saturday, 01 August 2026 01:01:12 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

అభివృద్ధి పనులపై ఎంపీ గోడం నగేష్ తనిఖీ..

నాసిరకం ఇసుక వాడకంపై ఆగ్రహం

Date : 09 July 2026 06:22 PM Views : 218

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ గురువారం జిల్లాలో పర్యటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.తిర్యాని మండలంలోని సుంగాపూర్ గ్రామంలో రూ.3.75 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న శాటిలైట్ భవనం నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ గోడం నగేష్, పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.అనంతరం సుంగాపూర్‌లో రూ.3.25 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల భవనం నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణంలో నాసిరకం ఇసుక వాడుతున్నట్లు గుర్తించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. వెంటనే నాసిరకం ఇసుకను తొలగించి నాణ్యమైన ఇసుకతోనే నిర్మాణ పనులు చేపట్టాలని సంబంధిత ఏఈ కి ఆదేశాలు జారీ చేశారు. ప్రజాధనం వృథా కాకుండా ప్రతి నిర్మాణం నాణ్యతతో పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కోటినాక విజయకుమార్, జిల్లా ఎన్నికల కన్వీనర్ నాగేశ్వరరావు, జిల్లా నాయకుడు కేసరి ఆంజనేయులు గౌడ్, బీజేపీ తిర్యాని మండల అధ్యక్షుడు సారా రమేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి గాయంగి తిరుపతి, నాయకులు రంగు అరుణ్ కుమార్, శంకర్ గౌడ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :