Saturday, 01 August 2026 01:12:14 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఓట్ల సర్వే నిబంధనల ప్రకారం జరగాలి.

టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్.

Date : 16 July 2026 03:47 PM Views : 85

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : చెన్నూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వారి కుటుంబ సభ్యుల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించే ప్రక్రియ జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బి ఆర్ ఎస్ మాజీ భీమారం మండల పార్టీ అధ్యక్షులు కలగూర రాజకుమార్ అన్నారు.ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం బి ఎల్ ఓ లు ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి హౌస్ టు హౌస్ సర్వే నిర్వహించి, అవసరమైన ఫారాలు నింపించి, వాటికి సంబంధించిన రిసీవ్డ్ కాపీని ఓటర్లకు అందజేయాల్సి ఉంది. అయితే భీమారం గ్రామ పంచాయతీతో పాటు పలు గ్రామాలలో ఈ నిబంధనలు అమలు కావడం లేదని ఆరోపించారు.అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రమే ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడం జరుగుతోందని, కొన్ని చోట్ల కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ బి ఎల్ ఎ లకు మాత్రమే ఫారాలు అందించి, ఇతర రాజకీయ పార్టీల బి ఎల్ ఎ లకు సమాచారం ఇవ్వడం లేదని విమర్శించారు.భీమారం గ్రామ పంచాయతీలో బిఎల్ఓ లను ఒకేచోట కూర్చోబెట్టి ప్రజలను అక్కడికే రమ్మని చెప్పడం, వచ్చిన ఓటర్లతో నిర్లక్ష్యంగా, అనుచితంగా ప్రవర్తించడం జరుగుతోందని పలువురు ఓటర్లు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. “చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు” అనే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే దీనిపై రాజకీయ జోక్యం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయని పేర్కొన్నారు.గడువు పొడిగించిన నేపథ్యంలో బి ఎల్ ఓ లు ప్రతి ఇంటికి వెళ్లి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే బి ఆర్ ఎస్ పార్టీ తరఫున ఎన్నికల సంఘానికి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని కలగూర రాజకుమార్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ధర్మారం సర్పంచ్ దాసరి మణి దీపక్, మాజీ వైస్ ఎంపీపీ జనంపల్లి సమ్మయ్య, సీనియర్ నాయకులు చిప్ప పురుషోత్తం, సూరం లచ్చన్న, యువ నాయకులు కుంబ్రే బబ్లు, మాజీ వార్డు సభ్యుడు పూజారి కృష్ణ, ఆరెపల్లి రాజబాబు, చకినారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: