Saturday, 01 August 2026 01:24:01 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

హట్టి ఆశ్రమ పాఠశాలలో ఆహారంపై విద్యార్థుల ఆందోళన.. ఐటీడీఏ పీవో హామీతో సద్దుమణిగిన ఉద్రిక్తత

Date : 15 July 2026 08:29 AM Views : 33

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరామెరి మండలంలోని హట్టి ఆశ్రమ పాఠశాలలో నాసిరకం భోజనం అందించారంటూ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం వండిన అన్నం తినలేని పరిస్థితి ఉండగా, సాయంత్రం కూడా నాణ్యత లేని కూర వడ్డించడంతో విద్యార్థులు ఆకలితో పాఠశాల నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు.సమాచారం అందుకున్న ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్, విద్యార్థి, మహిళా, టైగర్ సేనా నాయకులతో కలిసి పాఠశాలకు చేరుకుని విద్యార్థులను శాంతింపజేశారు. వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.విద్యార్థులు పాఠశాల హెచ్‌ఎం విధుల నిర్వహణ, బోధన లోపాలు, ఆహార సరుకుల నిర్వహణ, సిబ్బంది ప్రవర్తన, వాచ్‌మెన్ వ్యవహారశైలిపై పలు ఆరోపణలు చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్‌ఎంను మార్చడంతో పాటు సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకునే వరకు తరగతులను బహిష్కరిస్తామని హెచ్చరించారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఐటీడీఏ పీవో మంద మకరందు ఫోన్ ద్వారా నాయకులతో మాట్లాడి, విద్యార్థులకు న్యాయం చేస్తామని, ఆరోపణలపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం నాయకుల చొరవతో రాత్రి సుమారు 10:30 గంటలకు విద్యార్థులకు ప్రత్యేకంగా భోజనం వండించి అందించారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. అయితే, విద్యార్థులు చేసిన ఆరోపణలు ప్రస్తుతం వారి వాదనలుగా మాత్రమే ఉన్నాయి. ఈ ఆరోపణలపై పాఠశాల హెచ్‌ఎం లేదా సంబంధిత అధికారుల అధికారిక స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది. అధికారులు సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు.

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :