వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమరి,జూన్ 26న నిర్వహించనున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, మాదకద్రవ్య రహిత సమాజం నిర్మాణ లక్ష్యంతో సోమవారం మందమర్రి ప్రాంతంలో అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా పోలీసులు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరై, అవగాహన కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు తన మద్దతు తెలుపుతూ అవగాహన బూత్ వద్ద సెల్ఫీ తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో మందమర్రి సీఐ, ఎస్సై,ఇతర పోలీసులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం