Sunday, 02 August 2026 04:15:47 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

అర్ధరాత్రి ఆదివాసి ఇల్లు దహనం.. రూ.2.77 లక్షల నగదు బూడిద

కారకులపై చర్యలు తీసుకోకుంటే ఇల్లు ముట్టడిస్తాం హెచ్చరిక

Date : 17 May 2026 07:12 PM Views : 283

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : కోటపల్లి (మే 17): అర్ధరాత్రి వేళ ఆదివాసీల ఇండ్లు కాలిపోవడానికి కారకులైన పెత్తందార్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్స గ్రామంలో ప్రమాద స్థలాన్ని ఆదివారం ఆయన పరిశీలించి, బాధితులను పరామర్శించారు.మహారాష్ట్ర నుండి వలస వచ్చి ఇక్కడ వ్యవసాయ పాలేరుగా జీవిస్తున్న సిడం లచ్చన్న, సిడం రాకేష్‌ల అద్దె ఇల్లు మే 5న జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. గ్రామానికి చెందిన బీరం భాస్కర్ రెడ్డి తన పెరట్లోని చెత్తను కాల్చి, నిప్పులు ఆర్పకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, బాధితులు కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డారని పున్నం తెలిపారు. ఈ ప్రమాదంలో రూ. 2.77 లక్షల నగదు, 10 తులాల వెండి బూడిదయ్యాయన్నారు.బాధితులను ఆదుకోవాల్సింది పోయి యజమాని శెనిగరపు మల్లారెడ్డి మానసికంగా హింసించడం దుర్మార్గమని, ఘటన జరిగి 10 రోజులు దాటినా మంత్రి వివేక్, పోలీసులు స్పందించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. అధికారులు స్పందించి బాధితులకు నష్టపరిహారం అందించి, న్యాయం చేయాలని, లేనిపక్షంలో బీరం భాస్కర్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తలండి ముత్తయ్య, ఆత్రం సంపత్, కోర్తే సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :