Saturday, 01 August 2026 01:21:28 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

వేధింపులపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలి

Date : 28 June 2026 03:36 PM Views : 203

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బహిరంగ ప్రదేశాలు, విద్యాసంస్థలు, వసతి గృహాల పరిసరాల్లో ఎలాంటి వేధింపులు ఎదురైనా మౌనంగా ఉండకుండా నిర్భయంగా షీ టీమ్‌కు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని షీ టీమ్ ఎస్సై ఉషారాణి పిలుపునిచ్చారు. మహిళల భద్రతకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు అండగా నిలుస్తామని ఆమె స్పష్టం చేశారు.పట్టణంలోని బాలికల వసతి గృహంలో మహిళల భద్రత, చట్టపరమైన హక్కులపై నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు, విద్యార్థినులు తమపై జరిగే వేధింపులను చిన్నవిగా భావించి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమయానికి ఫిర్యాదు చేస్తే నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లు జ్యోతి, సతీష్ మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం షీ టీమ్ నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. ఈవ్‌టీజింగ్, సైబర్ వేధింపులు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు, అసభ్యకర సందేశాలు, వెంటపడటం వంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు హెల్ప్‌లైన్‌లు, షీ టీమ్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.కార్యక్రమంలో విద్యార్థినులకు మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, షీ టీమ్ విధులు, ఫిర్యాదు చేసే విధానం, స్వీయ రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వేధింపులకు పాల్పడే వ్యక్తులపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :