Friday, 31 July 2026 11:09:21 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

భరోసా టీం ఆధ్వర్యంలో నర్సింగ్ కళాశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం

Date : 07 July 2026 05:15 PM Views : 75

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ చిత్తరంజన్ పర్యవేక్షణలో ఆసిఫాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో భరోసా టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా భరోసా సెంటర్ ద్వారా లైంగిక దాడులు, అత్యాచారాలకు గురైన బాధితులకు అందించే న్యాయ, వైద్య, మానసిక, కౌన్సెలింగ్ తదితర సేవలను వివరించారు. విద్యార్థినులకు సేఫ్ టచ్ – అన్‌సేఫ్ టచ్, పోక్సో చట్టం , బాల్య వివాహ నిరోధక చట్టం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్య ద్వారానే ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవచ్చని, చట్టాలపై అవగాహన ప్రతి విద్యార్థికి అవసరమని సూచించారు.అదేవిధంగా సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మొబైల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్పరిణామాల గురించి వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-100కు కాల్ చేయాలని, భరోసా సహాయ నంబర్ 8712670561ను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భరోసా టీం లీగల్ అడ్వైజర్ శైలజ, కౌన్సిలర్ శ్వేత, రిసెప్షనిస్ట్ సుమలత, సపోర్ట్ పర్సన్స్ సరిత, స్నిగ్ధ, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మలత, వైస్ ప్రిన్సిపాల్ పద్మ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :