Friday, 31 July 2026 09:04:51 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీల మోసపూరిత మాటలు నమ్మకండి.

హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య

Date : 13 May 2026 01:24 PM Views : 991

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సింగరేణి కార్మికులను ఐఎన్‌టీయూసీ,ఏఐటీయూసీ సంఘాలు తమ అసత్య ప్రచారాలతో తప్పుదోవ పట్టిస్తున్నాయని, వారి మాటలను నమ్మవద్దని హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం శ్రీరాంపూర్ ఏరియా సిసిసిలోని హెచ్‌ఎంఎస్ కార్యాలయంలో జరిగిన "జగన్ పార్టీ" (విభాగం) సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సారయ్య మాట్లాడుతూ, 2023 ఎన్నికల తర్వాత గెలిచిన సంఘాలు కార్మికులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కాయని విమర్శించారు.ముఖ్యంగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం.మారుపేర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఆగిపోవడం.ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న విజిలెన్స్ కేసులు పరిష్కరించకపోవడం.కార్మికులపై పడుతున్న భారీ ఇన్‌కమ్ టాక్స్ భారాన్ని తగ్గించడంలో విఫలం కావడం.కొత్త బొగ్గు గనుల ఏర్పాటుపై నిర్లక్ష్యం వహించడం.రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు చెల్లించాల్సిన ₹51 వేల కోట్ల బకాయిలపై నోరు మెదపకపోవడం.అసత్య ప్రచారాలను మానుకోవాలి అని అన్నారు.గత రెండున్నరేళ్లుగా పైరవీలతో కాలక్షేపం చేసిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు.ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో యాజమాన్యం తమ డిమాండ్లకు ఒప్పుకుందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి" అని ఆయన మండిపడ్డారు. ఒకవేళ నిజంగానే యాజమాన్యం డిమాండ్లను అంగీకరిస్తే, సింగరేణి సీఎండీ లేదా డైరెక్టర్లు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేవలం మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చి, సమస్యలు తీరిపోయాయని చెప్పడం కార్మికులను వంచించడమేనని పేర్కొన్నారు.సింగరేణిలో సమస్యల పరిష్కారానికి 'సమ్మె' ఒక్కటే మార్గమని, ఆ దిశగా అడుగులు వేయాలని సారయ్య సూచించారు. నిజంగా కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే, సింగరేణిలోని అన్ని రిజిస్టర్డ్ సంఘాలను కలుపుకొని ఐక్య పోరాటాలకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ​ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ నాయకులు మీసాల మహేందర్, నామాల శ్రీనివాస్, సందీప్ గౌడ్, చెవుల శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, వంశీకృష్ణ, తులా అనిల్ కుమార్, అనిల్ అడ్డూరి మరియు ఇతర కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :