వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : స్వాతంత్ర సమరయోధురాలు రాణి ఝాన్సీలక్ష్మీబాయి వర్ధంతిని రిటైర్డ్ ఆర్మీ జవాన్ సింగరేణి ఎస్ అండ్ పిసి ఉద్యోగి రాజేష్ పివ్ హల్, రాణి పివ్ హల్ దంపతుల ఆధ్వర్యంలో గురువారం రాణి ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతిని నిర్వహించారు. మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానో పాధ్యాయులు జె. పురుషోత్తం మాట్లాడుతూ. ఝాన్సీ లక్ష్మీబాయి 1828 వారణాసిలో జన్మించారు.చిన్నతనం నుంచి స్వారీ కత్తి యుద్ధం లో పట్టు సాధించారు1857 బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన భారత తిరుగుబాటులో ఆమె కీలక పాత్ర పోషించి ఆమె ధైర్యానికి దేశభక్తికి ప్రతికగా నిలిచారు.ఝాన్సీ రాణి చిన్నతనం నుండి దేశ స్వాతంత్రం కోసం పోరాడి 1858 జూన్లో మరణించారు.భారత దేశ చరిత్రలో ఒక వీరవనితగా స్వాతంత్ర సమరయోధురాలిగా గౌరవించబడిందని ఆమె ధైర్యం, సంకల్పం నేటికీ అనేక మందికి ప్రేరణ నిస్తాయని,విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి దేశభక్తిని పెంపొందించుకోవడంతో పాటు స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవలసిన అవసరం ఉందన్నారు. రాజేష్, రాజేష్ ఫీహ్వాల్ మాట్లాడుతూ.విద్యార్థులు దేశభక్తి భావాన్ని పెంపొందించే లక్ష్యంతో పాఠశాలలో స్వతంత్ర సమరయోధులు, మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తిరుపతిరెడ్డి, మరియమ్మ,వాణి,దేవి జయశ్రీ,కల్పలత, రవీందర్,ప్రసాదరావు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం