Saturday, 01 August 2026 03:28:21 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

బెల్లంపల్లిలో విజయవంతంగా 389వ వారపు అన్నదాన కార్యక్రమం

Date : 15 June 2026 05:29 PM Views : 85

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదానం మహాదానం అనే మహోన్నత భావనతో అమ్మ ఒడి ఎన్జీవో ఆధ్వర్యంలోని అన్నదాత ప్రాజెక్ట్, టెక్నో డ్యాన్స్ అకాడమీ సహకారంతో సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని కాంతా చౌరస్తా మరియు పల్లెటూరి బస్ స్టాండ్ ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.ఆకలితో అలమటించే నిరుపేదలకు ప్రతి వారం నిరంతరంగా ఆహారం అందించాలనే లక్ష్యంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని 2020 ఏప్రిల్ 5న ప్రారంభించారు. దాతల సహకారం, అభ్యర్థన మేరకు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమం బెల్లంపల్లిలో విజయవంతంగా 389వ వారానికి చేరుకుంది.బాల గణేష్ యూత్ సభ్యులు (దబ్బు సాట్ లైన్ రోడ్ నెం.4, బెల్లంపల్లి) సహకారంతో సుమారు 200 మంది లబ్ధిదారులకు అన్నదానం నిర్వహించారు. ఇందులో భిక్షాటన చేసేవారు, నిరుపేదలు, రోజువారీ కూలీలు, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమ్మ ఒడి అన్నదాత ప్రాజెక్ట్ వ్యవస్థాపకులు, మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్ అజ్మీరా మోహన్, టెక్నో డ్యాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమండ్ల మధుకర్ మాట్లాడుతూ, 389వ వారపు అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఆకలితో బాధపడుతున్న వారికి ఆహారం అందించడం ద్వారా లభించే సంతృప్తి అపారమని, ఇది సమాజానికి అందించే విలువైన సేవ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి నిరంతరం సహకరిస్తున్న దాతలు, వాలంటీర్లకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హనుమండ్ల సువర్ణ, ఎం.డి. రేహానా, గన్నెవరం తిరుమలాచారి, మాతూరి వరప్రసాద్, చెందుపట్ల లింగమూర్తి, ఎం.డి. యూసుఫ్, బాల గణేష్ యూత్ సభ్యులు మరియు అమ్మ ఒడి వాలంటీర్లు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: