Sunday, 02 August 2026 02:06:31 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలే రక్షణ కవచం: మందమర్రి ఎస్ఐ జి. నరేష్

యాపల్ ప్రాంతంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన సమావేశం

Date : 18 July 2026 09:27 PM Views : 67

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పరిధిలోని యాపల్ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే ధ్యేయంగా సీసీ కెమెరాల ఏర్పాటుపై శనివారం ఒక ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. మందమర్రి సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) జి. నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో స్థానిక కాలనీవాసులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్ఐ జి. నరేష్ మాట్లాడుతూ.సమాజంలో ప్రజల రక్షణకు, అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్టకు సీసీ కెమెరాలు 'మూడో కన్ను'లా పనిచేస్తాయని పేర్కొన్నారు. ప్రతి కాలనీ, ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాలను ముందే నివారించవచ్చన్నారు. ఒకవేళ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినా, నిందితులను త్వరగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఈ నిఘా నేత్రాలు ఎంతో దోహదపడతాయని వివరించారు. ప్రజలందరూ బాధ్యతగా భావించి, తమ పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, ప్రముఖులు పూర్తి మద్దతు ప్రకటించారు. యాపల్ ప్రాంతాన్ని సురక్షితంగా మార్చేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు.ఈ అవగాహన సమావేశంలో స్థానిక ప్రముఖులు బొద్దిరెడ్డి వెంకటరెడ్డి, ఎం.డి. అబ్బాస్, బొద్దున ఓంప్రకాష్, వనం నర్సయ్య, సంగార్తి సంతోష్, అడ్డూరి సాంబమూర్తి, పిండి సురేష్, కొమిరిశెట్టి తిరుపతి, జిల్ల రాజు తదితరులు పాల్గొని సీసీ కెమెరాల ఏర్పాటుకు సంఘీభావం తెలిపారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: