Saturday, 01 August 2026 03:26:59 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

సీపీఐ మందమర్రి మండల నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Date : 10 July 2026 04:54 PM Views : 181

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సీపీఐ మందమర్రి మండల నూతన కమిటీని శుక్రవారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన మండల సమితి సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సమితి సభ్యులు కాదండి సాంబయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీపీఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నిర్మాణం, ప్రజా ఉద్యమాల బలోపేతంపై దిశానిర్దేశం చేశారు.సమావేశంలో 13 మంది సభ్యులతో కూడిన మండల కార్యవర్గం, 21 మంది సభ్యులతో కూడిన మండల కౌన్సిల్‌ను ఏకగ్రీవంగా ఆమోదించి నూతన మండల కమిటీని ప్రకటించారు. మండల కార్యదర్శిగా వనం సత్యనారాయణ, సహాయ కార్యదర్శిగా తాళ్లపల్లి వీరయ్య, కోశాధికారిగా బండారి రాజేశం, మండల ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రోడ్డ నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరిస్తూ పోరాటాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, యువత, మహిళల సమస్యల పరిష్కారానికి సీపీఐ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. నూతన కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఇప్పకాయల లింగయ్య, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, నక్క వెంకట్‌స్వామి, మామిడి గోపి, మహిళా నాయకురాలు రోడ్డ తిరుమలతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: