Saturday, 01 August 2026 01:28:12 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

న్యాయ శాస్త్ర పట్టభద్రులు శిక్షణ భృతి, న్యాయ శాస్త్ర గ్రంథాలు, ఫర్నిచర్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి

Date : 24 June 2026 08:34 PM Views : 150

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా షెడ్యూలు కులముల అభివృద్ధి శాఖ ద్వారా 2025-26 సంవత్సరానికి జిల్లాలోని షెడ్యూల్డ్ కులములకు చెందిన న్యాయ శాస్త్ర పట్టభద్రులు శిక్షణ భృతి, న్యాయ శాస్త్ర గ్రంథాలు, ఫర్నిచర్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 39 సంవత్సరాల లోపు న్యాయ శాస్త్ర పట్టభద్రులకు 3 సంవత్సరాల పాటు న్యాయ పరిపాలనలో శిక్షణ నిమిత్తం జిల్లాలోని లా అధికారులకు అటాచ్ చేయడం జరుగుతుందని, శిక్షణ కాలంలో నెలకు 3 వేల రూపాయల చొప్పున శిక్షణ భృతి, న్యాయ శాస్త్ర గ్రంధాలు, ఫర్నిచర్ కొనుగోలు నిమిత్తం ఒకసారి 50 వేల రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు. అర్హత గల న్యాయ శాస్త్ర పట్టభద్రులు ఆన్ లైన్ లో EPASS-https://Telanganaepass.cgg.gov.in లో జూలై 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని, అభ్యర్థులు భారత్ అసోసియేషన్ లో సభ్యులుగా ఉండాలని, సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంత వాసులకు 1 లక్ష 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల రూపాయల ఆదాయం ఉన్నట్లు మీ -సేవా ద్వారా జారీ చేయబడిన ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాలని తెలిపారు. సంబంధిత దరఖాస్తు, పత్రాలను సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల జిల్లా షెడ్యూల్డ్ కులాల శాఖ కార్యాలయంలో సమర్పించాలని, ఇతర వివరాలకు కార్యాలయ పనివేళలలో సంప్రదించవచ్చని తెలిపారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :