Saturday, 01 August 2026 01:19:08 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగ: జీఎం ఎన్. రాధాకృష్ణ

Date : 20 June 2026 02:32 PM Views : 47

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమరి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో శనివారం ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మందమరి ఏరియాలోని అన్ని గనులు, వివిధ విభాగాలు, జనరల్ మేనేజర్ కార్యాలయంలో యోగా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని, యోగా ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం పెంపొందుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ మరింత ప్రగతి సాధించగలదని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ఏరియాలోని వివిధ విభాగాల అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, జీఎం కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు చేశారు. అనంతరం యోగ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎస్‌వో టు జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, సీఎంఓఏఐ జాయింట్ సెక్రటరీ రవి, డీజీఎం పర్సనల్ సిహెచ్. అశోక్, సీనియర్ పీఓ సత్యనారాయణ, ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి గీతిక, యోగా మాస్టర్ శంకర్‌తో పాటు జీఎం కార్యాలయ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: