Saturday, 01 August 2026 01:24:11 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

మహిళలు సాధికారత వైపు అడుగులు వేయాలి రాష్ట్ర సంచాలకులు ఏ. శ్రీనివాస్ రెడ్డి

Date : 04 July 2026 05:36 PM Views : 127

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 04 మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకుని ఆర్థిక స్వావలంబన సాధిస్తూ సాధికారత వైపు అడుగులు వేయాలని వయోజన విద్యాశాఖ రాష్ట్ర సంచాలకులు ఏ. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అలాగే నిరక్షరాస్యత నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.వయోజన విద్యాశాఖ జిల్లా ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల సఖి సహకారంతో నిర్వహించిన 100 రోజుల కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు శనివారం మందమర్రిలోని సీఈఆర్ క్లబ్‌లో పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సంచాలకులు ఏ. శ్రీనివాస్ రెడ్డికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు కుట్టు శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అలాగే చదువును మధ్యలో నిలిపివేసిన మహిళలు ఓపెన్ పదో తరగతి, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసి ఉన్నత విద్యను అభ్యసించాలని కోరారు. చదువుకున్న మహిళలు చదువురాని వారికి స్వచ్ఛందంగా విద్యను బోధించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం కుట్టు శిక్షణ పరీక్ష పత్రాలను ఆయన విడుదల చేశారు.వయోజన విద్యాశాఖ నిజామాబాద్ జిల్లా డైరెక్టర్ పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లాలో జిల్లా కలెక్టర్, అధికారుల సహకారంతో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాలు 100 రోజుల పాటు విజయవంతంగా కొనసాగాయని తెలిపారు. మహిళలను సాధికారత వైపు నడిపించడంలో కుట్టు శిక్షణ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.మంచిర్యాల ప్రాజెక్టు ఆఫీసర్ ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ, మహిళల్లో నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి సఖి క్లబ్ అడ్మినిస్ట్రేటర్, డీఆర్‌పీ బండ శాంకరి, సుమన్ అధ్యక్షత వహించగా, కుట్టు శిక్షణ కేంద్రం కోఆర్డినేటర్ ఉప్పులేటి గోపిక, ఆర్గనైజర్ ఉప్పులేటి నరేష్, శిక్షకురాలు ఉప్పులేటి శారదతో పాటు శిక్షణ పొందిన మహిళలు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :